About
హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, హిమాయ తసాగర్ జలాశయాలున్నాయి. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. వీటి చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ.. 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం పలు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. మొత్తం 84 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. జీవో 111 (GO 111) ని ఎత్తివేస్తామన సీఎం కేసీఆర్ (cm kcr) అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది.మిషన్ కాకతీయతతో గ్రామాల్లో చెరువుల సంరక్షణకు కంకణం కట్టుకున్న సర్కార్.. హైదరాబాద్ జలాశయాల విషయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం ఎందుకు ? జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందిజీవో 111పై ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించింది govt.  కోర్టు అడిగిన నివేదిక కు మరింత టైం అడిగిన govt.భవిష్యత్తుల్లో వందేళ్ల వరకు కూడా హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య రాదని పేర్కొంటున్నారు. అభివృద్ధి పేరుతో water bodies conservation నీ ఎలా అశ్రద్ధ చేస్తారు? వాటిని కూడా tank band లా మురికికూపం చేస్తారా?Lakes encroachment మూలంగా జరిగే అనర్ధాలు చూస్తూ కూడా జంటLakes అవసరం లేదని ఎలా అంటారు అందువల్ల వచ్చే పర్యావరణ సమస్యలు ఎంటి? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు.  సమాచారం సమీక్షలో హోస్ట్ D.Chamundeswari తో Consultant Water resources and climate change, B V Subba Rao గారి interview లో వినండి.See sunoindia.in/privacy-policy for privacy information.
37m 25s · Mar 30, 2022
© 2022 Audioboom